ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో అన్ని సౌకర్యాలతో కోవిడ్ కేర్ సెంటర్లు
By: chandrasekar Sat, 11 July 2020 4:52 PM
కరోనా టాస్క్ఫోర్స్
కమిటీ చైర్మన్ కృష్ణబాబు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76 కరోనా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ప్రతి జిల్లాలో 3,000 కరోనా
కేర్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని, తర్వాతి
దశలో ప్రతి జిల్లాలో 5,000కు
పెంచుతామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు రూ. కోటితో కోవిడ్ కేర్
సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరోనా టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్
కృష్ణబాబు సెంటర్లలో ఎక్స్రే, అంబులెన్స్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం 74 కోవిడ్ ఆస్పత్రుల్లో 5,874 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అయితే
కొన్ని కోవిడ్ సెంటర్లలో ఆహారం బాలేదన్న ఫిర్యాదులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
దృష్టికి వచ్చాయని కృష్ణబాబు తెలిపారు. దీంతో కోవిడ్ కేర్ సెంటర్లలో ఫుడ్ సరఫరాలో
ఐఆర్టీసీ వాళ్ల సలహా తీసుకుని పంపిణీకి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఫుడ్ విషయంలో
వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని, మొత్తం
ఆరు అంశాలపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. డెవలప్మెంట్కు
సంబంధించి జాయింట్ కలెక్టర్కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామమన్నారు.
కొన్నిచోట్ల పెండింగ్లో
ఉన్న బిల్లులను ఈ నెల 15 లోపు
పంపిచాలని, జూన్ 30 వరకు సంబంధించిన బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని
తెలిపారు. రాష్ట్రంలో రోజుకు ఒక్కో పేషెంట్కు రూ. 500 ఖర్చు చూస్తున్నామని కృష్ణబాబు తెలిపారు. ఈ విషయంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా గ్రేట్ అని కొనియాడారు. తన 20 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వ్యక్తిని చూడలేదన్నారు. ఇక
ఇతర రాష్ట్రాల నుంచి, బయట
నుంచి వచ్చే వారిని 10 శాతం
మాత్రమే పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పర్యవేక్షణ చేసే విధంగా
మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనికి 13 నుంచి 15 వేల
మంది పైగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని, 13 వేల
మంది ఇతర దేశాల నుంచి రోజుకు 4
చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. విశాఖలో రెండు, విజయవాడలో రెండు విమానాలకు అవకాశం ఇచ్చామని, గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా వచ్చే వారిలో రాయలసీమ
ప్రాంతం వాళ్లు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. వీరు తిరుపతి విమానాశ్రయంలో
దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణబాబు తెలిపారు.