Advertisement

అంబులెన్సు లోనే ప్రసవం అయిన కరోనా పేషెంట్

By: Sankar Wed, 29 July 2020 2:01 PM

అంబులెన్సు లోనే ప్రసవం అయిన కరోనా పేషెంట్



నిండు గర్భిణికి కరోనా సోకింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా.. 108 వాహనంలో మార్గం మధ్యలోనే ఆమెకు ప్రసవమైంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన 9 నెలల గర్భిణికి కరోనా సోకింది. డెలివరీ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి రావడంతో.. ఆమెను హైదరాబాద్‌కు తరలించేందుకు నుంగనూరుకు చెందిన 108 సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి.

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట వద్దకు వెళ్లే సరికి ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది డెలివరీ చేశారు. దీంతో ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అదే వాహనంలో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.

గర్భిణులకు కరోనా సోకినప్పటికీ.. ప్రసవం తర్వాత శిశువులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువ. కరోనా సోకిన తల్లులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని చనుబాలు కూడా పట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tags :
|

Advertisement