- హోమ్›
- వార్తలు›
- కోవిడ్–19 పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష... ఆరోగ్యశ్రీ ఆసుపత్రలన్నింటిలో ఆరోగ్య మిత్రలు అమలు...
కోవిడ్–19 పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష... ఆరోగ్యశ్రీ ఆసుపత్రలన్నింటిలో ఆరోగ్య మిత్రలు అమలు...
By: chandrasekar Fri, 09 Oct 2020 5:53 PM
ఆంధ్రప్రదేశ్ లో వైద్య
సేవలు మరింత మెరుగు పరచడానికి జగన్ పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో కోవిడ్–19
పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ
ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ
ఆసుపత్రలన్నింటిలో ఆరోగ్య మిత్రలను నియమించాలని సూచించారు. ఆసుపత్రుల్లో వైద్య
సేవలు, సదుపాయాలకు
గ్రేడింగ్ ఇవ్వాలని దీనికి సంబంధించిన ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తి
కావాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రతి
ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో మౌళిక వసతులు, వైద్యుల అందుబాటు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్, నాణ్యతతో
కూడిన ఆహారం, ఆరోగ్యమిత్రలు కచ్చితంగా అమలవ్వాలని సీఎం జగన్
అన్నారు. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లోనూ అవే ప్రమాణాలు పాటించాలని తెలిపారు.
ఆరోగ్యమిత్రలు రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలని పేర్కొన్నారు. 104 కాల్
సెంటర్ మరింత సమర్థంగా పని చేయాలని జగన్ సూచించారు.
ఈ నిబంధనలు పూర్తిగా అమలు
కావడానికి ఈ విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రతి రోజూ
తప్పనిసరిగా మాక్ కాల్స్ చేయాలని సీఎం తెలిపారు. ఫోన్ చేసిన అర గంటలో బెడ్ల
కేటాయింపు జరగాలని, హోం ఐసొలేషన్లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందాలని, వైద్యులు, ఏఎన్ఎంలు
వారికి అందుబాటులో ఉండాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల మెరుగైన
వైద్య సేవలు ప్రజలకు అందనుంది.