- హోమ్›
- వార్తలు›
- రానా, తమన్నా, ప్రకాశ్ రాజ్, సుదీప్ ఖాన్, విరాట్ కోహ్లీ, సౌరభ్ గంగూలీ లకు కోర్టు నోటీసులు
రానా, తమన్నా, ప్రకాశ్ రాజ్, సుదీప్ ఖాన్, విరాట్ కోహ్లీ, సౌరభ్ గంగూలీ లకు కోర్టు నోటీసులు
By: chandrasekar Wed, 04 Nov 2020 12:24 PM
తమిళనాడులో గత కొన్ని
రోజులుగా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్ లో పాల్గొని తమ డబ్బులు పోగొట్టుకుని
ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు తెలిసిందే. ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై మద్రాస్
హైకోర్టులోని మదురై బెంచ్ విచారణ చేపట్టింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు
వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్పై మద్రాస్
హైకోర్టు విచారణ జరిపింది. ఈ గ్యాంబ్లింగ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సినీ
ప్రముఖులు రానా, తమన్నా, ప్రకాశ్ రాజ్, సుదీప్ ఖాన్ తదితరులకు మదురై బెంచ్ మంగళవారం
నోటీసులు జారీ చేసింది. దీని కోసం వీరు సమాధానం ఇవ్వాల్సి వుంది.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్
కేసుపై జస్టిస్ ఎన్ కిరుబకరన్, బి పుగలేంధిలతో కూడిన ధర్మాసనం ప్రముఖులతో పాటు
ఇలాంటి ఇతర యాప్లకు నోటీసులు పంపింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆన్లైన్
గ్యాంబ్లింగ్లో లక్షలాది మంది డబ్బులు పొగొట్టుకుంటున్నారని పిటిషినర్ కోర్టుకు తెలిపాడు. గ్యాంబ్లింగ్కు బానిసలుగా
మారడం సమాజానికి అత్యంత ప్రమాదకరమని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని
ఉల్లంఘిస్తోందని పిటిషనర్ పేర్కొన్నాడు. చాలా మంది అమాయకులు దీనికి బానిసగా మారి
లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీనిని వెంటనే నిషేదించాలని చాలా మంది
ప్రజలు కోరుతున్నారు.