Advertisement

  • సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం ...బార్యభర్తల ఆత్మహత్య

సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం ...బార్యభర్తల ఆత్మహత్య

By: Sankar Thu, 03 Sept 2020 8:28 PM

సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం ...బార్యభర్తల ఆత్మహత్య


సికింద్రాబాద్ చిలకలగూడలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతుంది. అత్తమామల వేధింపులు, మరోవైపు భార్య భర్తల మధ్య గొడవలు కారణంగానే వెంకటేష్ మరియు భార్గవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. మరణించిన వారు మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు.

అయితే మృతురాలు భార్గవి పోస్టల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తుండగా.. మృతుడు వెంకటేష్ కరెంట్ డిపార్ట్మెంట్లో ఏ ఈ గా పని చేస్తున్నాడు. వీరికి వివాహం జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఇటీవలే గొడవల కారణంగా అత్తమామల నుండి విడిపోయి సపరేటుగా కాపురం పెట్టారు భార్య భర్తలు. అయిన వారి మధ్య కూడా తరచూ గొడవలు కావడంతో ఆత్మహత్య చేసుకున్నారు దంపతులు.

వెంకటేష్ బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు, భార్గవి వాష్ రూమ్ లో వెంటిలేషన్ కు తాడుతో బిగించుకొని సూసైడ్ చేసుకున్నారు. మృత దేహాలు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. మృతురాలు భార్గవి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :
|

Advertisement