Advertisement

Breaking News: ఎమ్మెల్యే కు మళ్లీ కరోనా సోకింది...!

By: Anji Sun, 06 Dec 2020 4:47 PM

Breaking News: ఎమ్మెల్యే కు మళ్లీ కరోనా సోకింది...!

వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గత జులైలో తనకు కరోనా సోకిందని, కొన్నిరోజులకే కోలుకున్నానని అన్నారు.

నిన్న అసెంబ్లీలో నిర్వహించిన కోవిడ్ టెస్టులో మరోసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. రీ ఇన్ఫెక్షన్‌కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. అభిమానుల ఆశీస్సులతో కరోనాను మరోసారి జయించి వస్తానని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

కాగా, అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ అయింది. మూడ్రోజుల కిందట తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకి కరోనా అని నిర్ధారణ అవ్వగా తాజాగా అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ గా తేలింది.

Tags :

Advertisement