పాకిస్థాన్లో కరోనా జాగ్రత్త పాటించనివారికి కరెంటు షాక్
By: chandrasekar Thu, 11 June 2020 8:45 PM
పాకిస్థాన్లో ప్రభుత్వం
ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నా అవేవీ కరోనాను ఆపట్లేదు. అందువల్ల కరోనా
వైరస్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు 113702 ఉండగా మరణాలు 2255 ఉన్నాయి. కరోనాను ఎలా కంట్రోల్ చెయ్యాలో అక్కడి
ప్రభుత్వానికీ, డాక్టర్లకూ, పోలీసులకూ అర్థం కావట్లేదు. ప్రధానంగా ప్రజలు పెద్దగా
సహకరించట్లేదు. మాస్కులు పెట్టుకోవట్లేదు. సోషల్ డిస్టాన్స్ అంటే ఏంటో కూడా
వాళ్లకు తెలియట్లేదు.
ప్రభుత్వం ఎన్నో కఠిన
చర్యలు తీసుకున్నా అవేవీ కరోనాను ఆపట్లేదు. దాంతో ఫైసలాబాద్ పోలీసులు ఓ కొత్త
నిర్ణయం తీసుకున్నారు. అదే షాక్ ట్రీట్మెంట్. ప్రజలకు కరెంటు షాక్ ఇస్తే అప్పుడు కచ్చితంగా మాస్క్ వాడతారని భావించిన
పోలీసులు విదేశాల నుంచి కరెంట్ షాక్ ఇచ్చే ప్రత్యేక ఎలక్ట్రిక్ షాట్ గన్
పరికరాల్ని తెప్పించారు. అవి లాఠీల లాగా ఉంటాయి. బటన్ నొక్కి మనిషికి అంటిస్తే చాలు కరెంటు షాక్ కొడుతుంది.
ఈ షాక్ వల్ల మనిషికి ఎలాంటి అపాయమూ ఉండదు. కాకపోతే అంటించినంత సేపూ మనకు నిజంగా
కరెంటు షాక్ తగిలితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది.
పోలీసులు ఎప్పుడైతే షాక్
ట్రీట్మెంట్ మొదలుపెట్టారో ప్రజలకు టెన్షన్ మొదలైంది. పోలీసులను చూడగానే వాళ్ల చేతుల్లో ఆ పరికరాలు
ఉన్నాయేమో అని చూస్తున్నారు. పరికరాలు లేకపోతే దర్జాగా పోలీసుల ముందుకు
వస్తున్నారు. పరికరం ఉంటే మాత్రం బాబోయ్ అనుకుంటూ
యూటర్న్ తీసుకొని ఇళ్లలోకి పారిపోతున్నారు. కొంతమంది ఈ షాకులూ అవీ ఎందుకని
బుద్ధిగా మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. తద్వారా ఇప్పుడు మన దేశంలో లాగే
పాకిస్థాన్ ఫైసలాబాద్లోనూ మాస్క్ వాడకం పెరిగింది.