Advertisement

  • తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజుకు అధిగమౌతున్న కరోనా‌ కేసులు

తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజుకు అధిగమౌతున్న కరోనా‌ కేసులు

By: chandrasekar Tue, 07 July 2020 3:05 PM

తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజుకు అధిగమౌతున్న కరోనా‌ కేసులు


తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది.ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్‌ బారినపడ్డ వారి సంఖ్య 27,733కు చేరింది. రాష్ట్రంలో సోమవారం 1831 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 1419 కేసులున్నాయి. ఇవాళ 11 మంది వైరస్‌తో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 306కి చేరింది.

ఒక్క రోజులో భారీగా 2078 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 14,781కి చేరింది. మరో 10,646 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ నిర్ధారణ అయిన 1831 కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1417 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్‌ జిల్లాల్లోనే 117 ఉన్నాయి.

అలాగే ఖమ్మం జిల్లాలో 21, మంచిర్యాలలో 20, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ అర్బన్‌, పెద్దపల్లి జిల్లాలో 9 చొప్పున, వికారాబాద్‌లో 7, సూర్యాపేటలో 6, కరీంనగర్‌లో 5, జగిత్యాలలో 4, సంగారెడ్డిలో 3, గద్వాల, యాదాద్రి, నారాయణపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 25 వేలు దాటిపోగా 300 మందికి పైగా ఈ మ‌హమ్మారికి బ‌ల‌య్యారు. రంగారెడ్డి జిల్లాలో 160 మందికి, మేడ్చ‌ల్‌లో 117 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

Tags :
|

Advertisement