కరోనా వైరస్ ను చైనా ల్యాబ్ లో సృష్టించారు.. చైనా వైరాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు
By: Sankar Mon, 14 Sept 2020 10:53 AM
ప్రపంచాన్ని గత తొమ్మిది నెలలుగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మొదట చైనాలో గుర్తించిన విషయం తెలిసిందే..అయితే కొంతమంది చైనా కావాలనే ఆ వైరస్ ను తయారు చేసింది అని కూడా అన్నారు..అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికి కూడా కరోనా వైరస్ చైనా సృష్టే అని వాదిస్తున్నాడు..తాజాగా చైనా వైరాలజిస్ట్ విడుదల చేసిన ఓ వీడియో ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఉన్నాయి.
కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్లోనే పుట్టిందని, దీనికి సంబంధించి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని డాక్టర్ లీ మెగ్ యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాంగ్కాంగ్లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో కరోనా వైరస్పై గతేడాది నుంచి పరిశోధనలు చేస్తోన్న లీ.. ఆమె పలు విషయాలను వెల్లడించారు.
న్యుమోనియాపై పరిశోధనలు చేసే సమయంలోనే ఈ ప్రాణాంతక కరోనా వైరస్ వుహాన్లోని ల్యాబ్లో తయారైనట్లు గుర్తించానని, అది పూర్తిగా చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందని అన్నారు. వైరస్కు సంబంధించి తాను హెచ్చరికలు చేసినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రమాదకరమైన వైరస్ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా నా హెచ్చరికలను బేఖాతరు చేశారని వ్యాఖ్యానించారు.
ఈ వైరస్ ప్రకృతి నుంచి సహజసిద్ధంగా పుట్టింది కాదని, అది వుహాన్ ల్యాబ్లోనే పుట్టిందనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయన్నారు. ప్రపంచాన్ని మభ్యపెట్టడానికే సముద్ర ఉత్పత్తుల మార్కెట్లోనే కరోనా వైరస్ పుట్టిందని ప్రచారం చేశారని తెలిపారు. ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాప్తిచెందుతున్న విషయాన్ని కూడా దాచిపెట్టారని, అధిక జన్యుపరివర్తన కలిగిన సార్స్-కోవి-2 వ్యాప్తి మొదలైతే ఎవరూ నియంత్రించలేరనేది వారికి తెలుసున్నారు. అయితే, లీ ఆరోపణలను వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ యువాన్ జిమింగ్ మాత్రం తోసిపుచ్చారు. కానీ, ఈ వీడియోపై చైనా అధికారులు ఇప్పటి వరకూ స్పందించకపోవడం గమనార్హం.