Advertisement

  • రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు కరోనా వైరస్

రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు కరోనా వైరస్

By: chandrasekar Fri, 13 Nov 2020 11:01 AM

రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు కరోనా వైరస్


కరోనా ఎవరిని వదిలి పెట్టడం లేదు. ఇటు సామాన్య ప్రజల నుండి అటు రాజకీయ నాయకుల వరకు అందరికి వ్యాపిస్తూ వుంది. ప్రస్తుతం రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని తెలిపారు. రాజకీయ నాయకులూ సమాజంలో ఎక్కువగా పాల్గొనడంవల్ల వైరస్ సోకడానికి ఎక్కువ అవకాశాలు వుంది.

సచిన్‌ పైలట్ కరోనా చికిత్స కోసం వైద్యుల సలహా తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా నుంచి త్వరగా కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని సచిన్‌ పైలట్‌ సూచించారు. ఇందువల్ల సమీపంలో ఆయనను కలసిన వారు వైరస్ బారిన పడివుంటే గుర్తించుట కోసం టెస్ట్ చేసుకోవలసి వుంది. లేకుంటే వీరివల్ల ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశం వుంది.

Tags :
|
|

Advertisement