బ్రేకింగ్ న్యూస్: రోబోలతో కరోనా టెస్ట్...!
By: Anji Tue, 22 Sept 2020 4:34 PM
ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తోంది. మాయదారి రోగం బారిన పడి కోట్లాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ వైరస్ బారి నుంచి వారి కాపాడేందుకు సింగపూర్ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేసింది. శాంపిల్స్ సేకరించే టైంలో కరోనా అంటుకోకుండాలన్న లక్ష్యంతో ప్రత్యేక రోబోను అభివృద్ధి చేసింది.
కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంతో పాటు ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించవచ్చంటున్నారు. ఇకపై కొత్తగా రూపొందించిన ‘స్వాబోట్’ తోనే స్వాబ్ టెస్ట్లు నిర్వహించాలని సింగపూర్ ప్రభుత్వం భావిస్తోంది. నేషనల్ క్యాన్సర్ సెంటర్ సింగపూర్ (ఎన్సీసీఎస్), సింగపూర్ జనరల్ ఆస్పత్రి (ఎస్జీహెచ్) వైద్యులు మెడికల్ రొబొటిక్స్ టెక్నాలజీ కలిగిన బయోబోట్ సర్జికల్ సంస్థ భాగస్వామ్యంతో ‘స్వాబోట్’ను అభివృద్ధి చేసినట్టు న్యూస్ ఆసియా ఛానల్ వెల్లడించింది.
శిక్షణ కలిగిన తమ దేశ ఆరోగ్య సిబ్బందికి కొవిడ్ ముప్పు లేకుండా.. కరోనా టెస్టుల్లో వారి సేవల్ని పరిమితం చేసేలా ఈ రోబోలను తయారు చేసినట్లు వెల్లడించింది. కరోనా అనుమానితుల ముక్కు నుంచి ఆటోమేటిక్గా ఈ రోబోలే స్వాబ్ తీస్తాయని ఆ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ స్వాబోట్ స్వీయ నిర్వహణ కలిగినదని, రోగులు దీన్ని తమ ఇష్టప్రకారం వినియోగించుకొనే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.