ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి...
By: chandrasekar Wed, 28 Oct 2020 9:58 PM
ఆంధ్రప్రదేశ్లో గత
కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన కేసులు మంగళవారం ఒక్కసారిగా
పెరిగిపోగా, బుధవారం కూడా స్వల్పంగా పెరిగాయి. బుధవారం రాష్ట్ర
వైద్య, ఆరోగ్య
శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 77,028 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,949
మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్
కేసులు 8,14,774కు చేరుకున్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు స్వల్పంగా తగ్గాయి.
బుధవారం కరోనా బారినపడి 18 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా
మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,643కు చేరుకుంది.
కరోనా మహమ్మారి బారిన పడి
గడిచిన 24
గంటల్లో అనంతపురం జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమ
గోదావరిలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో
ఒకరు, విశాఖపట్నంలో
ఒకరు మరణించారు. అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు భారీగా పడిపోయాయి. బుధవారం 3,609 మంది
కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ
వెల్లడించింది. ఇక, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా
నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 8,14,774 పాజిటివ్ కేసులకు గాను.. 7,81,509 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 26,622 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.