ఆంధ్రప్రదేశ్లో భారీగా తగ్గిన కరోనా వైరస్ కేసులు...
By: chandrasekar Fri, 18 Dec 2020 8:59 PM
ఏపీలో కరోనా పాసిటివ్
కేసులు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. ఈ
విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. కరోనా మరణాలు అత్యల్ప
స్థాయికి పడిపోయాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24
గంటల్లో 69,062 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 458
మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,77,806కి చేరింది.
రాష్ట్రంలో డిశ్చార్జిల
సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం 534 మంది కోవిడ్ 19 బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా మరణాలు
అత్యల్ప స్థాయికి పడిపోయాయి. గుంటూరులో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో
రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,070కు
చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,11,34,359 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో
పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,66,359 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం
యాక్టివ్ కేసులు 4,377కు పడిపోయాయి.