ఆంధ్రప్రదేశ్ లో 8 లక్షలకు చేరుకున్న కరోనా బాధితులు
By: chandrasekar Sat, 24 Oct 2020 09:22 AM
మళ్ళీ కరోనా కేసులు
క్రమంగా పెరుగుతూ వుంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ
పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఏపీలో కరోనా కేసులు 8
లక్షలు దాటేశాయి. ఇటీవలే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా, గత
నాలుగైదు రోజులుగా స్వల్పంగా పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య
శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 80,238 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,765
మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్
కేసులు 8,00,684కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు స్వల్పంగా
పెరిగాయి. శుక్రవారం 20 మంది కరోనా మహమ్మారి బారినపడి మరణించారు. దీంతో
రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,544కు
చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా
మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో నలుగురు, కడపలో
ముగ్గురు, కృష్ణాలో
ముగ్గురు, అనంతపురంలో
ఇద్దరు, చిత్తూరులో
ఇద్దరు, తూర్పు
గోదావరిలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు
మృత్యువాత పడ్డారు. అలాగే డిశ్చార్జిలు సైతం రాష్ట్రంలో భారీగా పడిపోయాయి.
శుక్రవారం 4,281 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి
అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 8,00,684 పాజిటివ్ కేసులకు గాను 7,62,419 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 31,721 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, తూర్పు
గోదావరి, పశ్చిమ
గోదావరి, గుంటూరు, కృష్ణా
జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని
మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు.