Advertisement

  • అందరికీ అందుబాటులో ఉండేట్టుగా కరోనా వ్యాక్సిన్ ధర

అందరికీ అందుబాటులో ఉండేట్టుగా కరోనా వ్యాక్సిన్ ధర

By: chandrasekar Thu, 23 July 2020 11:16 AM

అందరికీ అందుబాటులో ఉండేట్టుగా కరోనా వ్యాక్సిన్ ధర


వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయబోతున్న కంపెనీ స్వయంగా కరోనా వ్యాక్సిన్ ధర నిర్ణయించామనే విషయాన్ని వెల్లడించింది. అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఉన్న ఆ వ్యాక్సిన్ ధరను సాధ్యమైనంతవరకూ ప్రభుత్వాలు ఉచితంగానే అందించే అవకాశాలు కూడా లేకపోలేదు.

కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందురేసులో ఉన్న కంపెనీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ అగ్రదేశాలు పరిశోధనల్లో మునిగిఉన్నా యూకేకు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధనలు ముందంజలో ఉన్నాయి. యూకేకు చెందిన మరో ప్రసిద్ధ ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి చేస్తున్న వ్సాక్సిన్ అభివృద్ధి కీలకమైన రెండు క్లినికల్ దశల్ని దాటింది. క్లినికల్ దశ ప్రయోగ ఫలితాల్ని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తాజాగా వెల్లడించింది కూడా. వ్యాక్సిన్ విజయవంతమైందని చెప్పింది.

2021 జూన్ కు వ్యాక్సిన్:

అన్నీ అనుకున్నట్టు జరిగితే మూడు నెలల్లోనే 30 నుంచి 40 కోట్ల టీకా డోసుల్ని తయారు చేసే సామర్ధ్యాన్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ కలిగి ఉంది. వచ్చేయేడాది అంటే 2021 జూన్ కు వ్యాక్సిన్ ఆవిష్కరిస్తామని చెప్పారు.

కరోనా' వ్యాక్సిన్ ధర వేయి రూపాయలు:

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందనీ అందరికీ ఆసక్తి నెలకొంది. ధర అందరికీ అందుబాటులో ఉంటుందా సంశయం కూడా ఉంది. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా చేసే బాధ్యతను తీసుకున్న ఇండియన్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందనేది వెల్లడించారు.

కంపెనీ సీఈఓ అదార్ పూణావాలా స్వయంగా ఈ విషయంపై ప్రకటన చేశారు. వ్యాక్సిన్ ధర వేయి రూపాయల వరకూ ఉంటుందని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలే సామూహిక ఇమ్యునైజేషన్ కింద ఉచితంగా అందించే అవకాశాలున్నాయని అదార్ పూణావాలా చెప్పారు. ఆఫ్రికా వంటి నిరుపేద దేశాలకు 2-3 డాలర్లకు అంటే 150 నుంచి 225 రూపాయలకే అందించనున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.

Tags :
|
|

Advertisement