Advertisement

  • అనేక మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్​లో చిక్కుకుపోయారు... ఎందుకో తెలుసా...?

అనేక మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్​లో చిక్కుకుపోయారు... ఎందుకో తెలుసా...?

By: Anji Tue, 22 Dec 2020 5:31 PM

అనేక మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్​లో చిక్కుకుపోయారు... ఎందుకో తెలుసా...?

కొత్త కరోనా వైరస్​ స్ట్రెయిన్​ ఉప్పెనలా విస్తరిస్తున్న తరుణంలో.. విమాన సర్వీసులను రద్దు చేస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయంతో అనేక మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్​లో చిక్కుకుపోయారు.
దీంతో క్రిస్మస్, కొత్త సంవత్సర​ వేడుకల సమయంలో స్వదేశానికి రావాలనుకున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. చాలా మంది విద్యార్థులు జనవరి ప్రారంభానికి ముందే స్వదేశానికి చేరుకుని సెలవు కాలంలో కుటుంబాలతో గడపాలనుకున్నారు.

అయితే బ్రిటన్​లో ఇరుక్కుపోవడం వల్ల వారి పరిస్థితి అయోమయంగా ఉంది,” అని యూకే జాతీయ విద్యార్థి యూనియన్ ఛైర్​పర్సన్ సనన్ అరోరా పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో లండన్​లోని భారత హైకమిషన్​ సామాజిక మాధ్యమాల వేదికగా భారత పౌర విమానయాన శాఖకు పలు సందేశాలను పంపుతోంది.

ముందస్తు జాగ్రత్త చర్యగా బ్రిటన్​ విమానాలపై మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల​ 31 వరకు నిషేధం విధించింది భారత్​.

మంగళవారం అర్ధరాత్రిలోపు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

Tags :
|

Advertisement