Advertisement

ఐఐటీ-మద్రాస్ లో కరోనా అలజడి...

By: chandrasekar Mon, 14 Dec 2020 8:30 PM

ఐఐటీ-మద్రాస్ లో కరోనా అలజడి...


ఐఐటీ-మద్రాస్ క్యాంపస్ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. 66 మంది విద్యార్థులతో పాటు మొత్తం 71 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. క్యాంపస్‌లో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఒకరిద్దరు పాజిటివ్ వ్యక్తుల వల్ల క్యాంపస్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

క్యాంపస్ లో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించారు. క్యాంపస్‌లో ప్రస్తుతం 774 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు, ప్రొఫెసర్లను ఇంటి నుంచి పని చేయాల్సిందిగా పేర్కొన్నారు.

హాస్టల్‌లో ప్రస్తుతం 10 శాతం విద్యార్థులు మాత్రమే ఉన్నారు. విశాలమైన తమ ల్యాబ్స్‌లో కరోనా నిబంధనల ప్రకారం స్కాలర్స్, స్టాఫ్ తమ ప్రాజెక్టులు నిర్వహించుకునే వసతులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. క్యాంపస్‌లోనే ఉండి తమ ప్రాజెక్టులను పూర్తి చేయాలని భావిస్తున్న విద్యార్థులకు తగిన వసతులు కల్పిస్తామని ప్రకటించింది.

Tags :
|
|

Advertisement