Advertisement

భారత ఉపరాష్ట్రపతికి కరోనా

By: chandrasekar Wed, 30 Sept 2020 11:29 AM

భారత ఉపరాష్ట్రపతికి కరోనా


భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా టెస్టు రిపోర్ట్ లో ఆయనకు కరోనా పాజిటీవ్ అని తేలింది. ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో అధికారులు ఈ సమాచారం తెలియజేశారు.

ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయనకు కరోనావైరస్ పాజిటీవ్ అని తేలినట్టు సమాచారం అందించారు. అందులో భారతదేశ ఉపరాష్ట్రపతికి రోటీన్ లో భాగంగా ఈ రోజు ఉదయం కరోనా పరీక్ష నిర్వహించారు.అందులో పాజిటీవ్ అని తేలి౦ది.

ఆయనలో కరోనా లక్షణాలు ఏమీ కనిపించలేదు. ఆరోగ్యం బాగుంది. హోమ్ క్వారైంటైన్ లో ఉండమని సలహా ఇచ్చారు. ఆయన సతీమణి శ్రీమతి. ఉషా నాయుడుకు పరీక్షలు నిర్వహించగా నెగెటీవ్ అని తేలింది.

Tags :
|

Advertisement