కలెక్టర్కు కరోనా...రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల్లో కలవరం
By: chandrasekar Wed, 26 Aug 2020 11:57 AM
కరోనా వైరస్ మహమ్మారి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులను సైతం కలవరపెడుతోంది. తాజాగా ఓ కలెక్టర్కు సోకింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కరోనా వైరస్ బారినపడ్డారు. రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
ఈ కారణంగా కలెక్టర్ మంగళవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల్లో కలవరం నెలకొంది. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు సైతం పాల్గొన్నారు.
ఆ భేటీలో పాల్గొన్నవారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ గౌతమ్తో సహా మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ అధికారుల సూచనలతో వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాదానికి సిద్ధమైయ్యారు.