Advertisement

రాష్ట్ర రవాణాశాఖ మంత్రికి కరోనా...

By: chandrasekar Tue, 15 Dec 2020 6:01 PM

రాష్ట్ర రవాణాశాఖ మంత్రికి కరోనా...


తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖ పడుతోన్న వేళ కొందరు ప్రముఖులు వాటి బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో మంత్రి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్‌లో ఉంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారుల వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Tags :
|

Advertisement