రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా...
By: chandrasekar Sat, 17 Oct 2020 6:51 PM
దేశంలో రోజురోజుకూ కేసుల
సంఖ్య పెరుగతూనే ఉంది. కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులను పట్టి
పీడిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం చాలామంది దీని బారిన పడ్డారు. తాజాగా
హీరో రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకింది. తనతో పాటు భార్య జీవిత, ఇద్దరు
కుమార్తెలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడినట్లు రాజశేఖర్ సోషల్మీడియా
ద్వారా తెలిపారు.
అయితే శివాని, శివాత్మిక
ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారని, తాను, జీవిత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్నట్లు రాజశేఖర్ శనివారం ట్వీట్ చేశారు. త్వరలోనే తామిద్దరం సంపూర్ణ
ఆరోగ్యంతో తిరిగి వస్తామని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న టాలీవుడ్ ఇటీవలే
షూటింగులతో బిజీగా ఉంది.
హీరోయిన్ తమన్నా ఇటీవలే
కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. తాజాగా రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా
బారిన పడటంతో సినీనటులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు
అంటున్నారు. ప్రముఖ హాస్యనటుడు ఇటీవలే కరోనా బారిన పడి మరణించిన విషయం తెలిసిందే.