టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కిషన్ రెడ్డికి కరోనా
By: chandrasekar Thu, 23 July 2020 4:57 PM
తెలంగాణలో తాజాగా
టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు గుర్తించారు. కరోనా మహమ్మారి దావానంలా పాకుతూనే ఉంది. ఈయన
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈయనకు కరోనా ఉన్నట్లు
గుర్తించిన వెంటనే చికిత్స కోసం ఫిల్మ్ నగర్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
అయితే, మంచిరెడ్డి
కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు
వారికి కూడా కరోనా టెస్టులు చేశారు. కుటుంబ సభ్యుల ఫలితాలు రావాల్సి ఉంది.
మొదట జనగామ ఎమ్మెల్యే
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు
బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గొంగిడి సునీత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులకు కరోనా
సోకింది. ఇదిలా ఉండగా, అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు
కరోనా బారినపడి కోలుకున్న విషయం అందరికి తెలిసిందే.