కార్తి చిదంబరానికి కరోనా
By: chandrasekar Mon, 03 Aug 2020 3:28 PM
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి కరోనా సోకింది. తమిళనాడులోని శివగంగ లోక్సభ ఎంపీగా ఉన్న కార్తి చిదంబరంకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్గా తేలిందని చెప్పారు. వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారంటైన్లో ఉన్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు మెడికల్ ప్రొటోకాల్ పాటించాలని చెప్పారు.
మరోవైపు పలువురు జాతీయ నేతలు కూడా కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఉదయం అమిత్షా, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కరోనా పాజిటివ్లుగా తేలారు. నిన్న రాత్రి కర్ణాటక ముఖ్యమంతి బీఎస్ యెడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది.
ఇవాళ ఉదయం యెడియూరప్ప కూతురుకి సైతం కరోనా సోకిందని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తర్వాత కరోనా బారినపడిన రెండో ముఖ్యమంత్రిగా యెడియూరప్ప నిలిచారు.