Advertisement

కేరళ గవర్నర్‌ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కరోనా...

By: chandrasekar Sat, 07 Nov 2020 6:47 PM

కేరళ గవర్నర్‌ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కరోనా...


కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

‘‘నాకు కరోనా సంక్రమించింది. పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. కానీ, ఆందోళన పడాల్సిందేమీ లేదు. గత వారం ఢిల్లీలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు తప్పక చేయించుకోండి. లేదంటే అబ్జర్వేషన్‌లో ఉండండి’’ అని ట్వీట్ చేశారు.

కేరళలలో ఇప్పటి వరకు 4,62,469 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 83,208 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం 27 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,640కి చేరుకుంది. 7,854 మంది కోలుకోవడంతో మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 3,88,504కు పెరిగింది.

Tags :
|

Advertisement