Advertisement

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యేకు కరోనా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యేకు కరోనా

By: chandrasekar Fri, 30 Oct 2020 3:54 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యేకు కరోనా


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కరోనా సోకి౦ది ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. తాను అస్వస్థతకు గురికావడంతో పరీక్ష చేయించుకున్నానని, దీంతో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బుధవారం 41,962 మందికి పరీక్షలు చేయగా 1,504 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇక రాష్ట్రంలో బుధవారం రోజు 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,656కి చేరింది.

బుధవారం ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,324కి చేరింది. ఇదే రోజు మరో 1,436 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 2,16,353 కు చేరింది. రికవరీ రేటు 91.80 శాతంగా ఉంది. 17,979 యాక్టివ్‌ కేసులకు గాను 14,938 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. కొత్త కేసుల్లో హైదరాబాద్‌లో 288, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 118, రంగారెడ్డిలో 115, నల్లగొండలో 93, ఖమ్మంలో 84, భద్రాద్రి-కొత్తగూడెంలో 83 నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణపేటలో 2, కుమ్రంభీం-అసిఫాబాద్‌లో 3 కేసులు వచ్చాయి.

Tags :
|

Advertisement