Advertisement

  • నెల రోజుల్లోనే తెలంగాణాలో తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా ..

నెల రోజుల్లోనే తెలంగాణాలో తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా ..

By: Sankar Mon, 06 July 2020 1:10 PM

నెల రోజుల్లోనే తెలంగాణాలో తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా ..



తెలంగాణాలో ఊహించని రీతిలో కరోనా వైరస్ విజృంభిస్తుంది ..లాక్ డౌన్ సమయంలో అంతగా కేసులు నమోదు కానప్పటికీ , లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత రోజు రోజుకి కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి ..ఒకవైపు ప్రతిపక్షాలు తెలంగాణలో కరోనా తీవ్రత మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ..సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉండే ప్రగతి భావం లోనే పదుల సంఖ్యలో కరోనా కేసులు రావడంతో సామాన్య జనాలు భయంతో వణికిపోతున్నారు ..నెల రోజుల క్రితం.. జూన్ 5న తెలంగాణలో 3290 కరోనా కేసులు ఉండగా.. మరణాల సంఖ్య 113. కానీ జులై 5 నాటికి కరోనా బాధితుల సంఖ్య 24 వేలకు చేరువలో ఉంది.

నెల రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. టెస్టులను పెంచడంతో ఇటీవల కాలంలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే తెలంగాణలో 1590 కొత్త కేసులను గుర్తించారు. అంతకు ముందు రెండు రోజులు వరుసగా 1800కుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10,904 యాక్టివ్ కేసులు ఉండగా.. 12,703 మంది డిశ్చార్జయ్యారు.

కరోనా వ్యాప్తి తీవ్రం అవుతున్నా మరోసారి లాక్‌డౌన్ విధించే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ప్రజలే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మాస్కులు, శానిటైజర్లు వాడుతూ.. అవసరానికి మాత్రమే బయటకు వెళ్తూ.. కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాగం మాత్రమే కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాని నేపథ్యంలో మనల్ని మనమే కాపాడుకోవాలి. అందుకే సోషల్ డిస్టెన్సింగ్, ఇతర జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి. లేదంటే మరో నెలలో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది.



Tags :
|
|

Advertisement