తమిళనాడులో కరోనా తీవ్రత...5,834 కొత్త కరోనా కేసులు..మరణాల సంఖ్య 118
By: chandrasekar Wed, 12 Aug 2020 5:02 PM
తమిళనాడులో కరోనా తీవ్రత
మరింతగా త్వరగా పెరుగుతు పోతున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24
గంటల్లో కొత్తగా 5,834 కరోనా కేసులు,
118 మరణాలు నమోదయ్యాయి.
దీంతో తమిళనాడులో కరోనా
కేసుల మొత్తం సంఖ్య 3,08,649కి, మరణాల సంఖ్య 5,159కి చేరింది. గత 24 గంటల్లో 6,005 మంది కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశార్చి అయినట్లు
ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దీంతో ఇప్పటి వరకు 2,50,680 మంది కోలుకోగా ప్రస్తుతం 52,810 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. రోడ్డు, రైలు, విమానం
ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు
పేర్కొంది.
Tags :
corona |
severity |