ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కరోనా సెకండ్ వేవ్ కలకలం
By: Sankar Mon, 07 Dec 2020 9:01 PM
తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు ఈ మధ్య కాలంలో తగ్గుముఖం పట్టాయి ...టెస్టులు చేస్తున్నప్పటికీ కేసులు మాత్రం వెయ్యిలోపే నమోదు అయితున్నాయి ..అయితే తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందా? అంటే అవుననే ఆందోళన వ్యక్తం అవుతోంది..
ఇవాళ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏకంగా ఎనిమిది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. వీరిలో నలుగురు సెక్టార్ ఎస్ఐలు... ఇద్దరు కానిస్టేబుళ్లు... మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.. అయితే, ఈ ఎనిమిది మందికి కోవిడ్ సోకడం ఇది రెండో సారి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. జూన్లో తొలిసారి కరోనా బారినపడ్డ ఈ పోలీసులు.. ఇప్పుడు మరోసారి ఆ మహమ్మారికి చిక్కారు..
దీంతో.. ఎస్ఆర్ నగర్ పోలీసులు భయాందోళనలు నెలకొన్నాయి. చలికాలంలో కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యాధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు.. మరోవైపు, రెండోసారి కోవిడ్ సోకిన కేసులు కూడా హైదరాబాద్లో వెలుగుచూశాయి.. ఎస్ఆర్ నగర్లో ఏకంగా ఎనిమిది మందికి రెండోసారి కోవిడ్ సోకడం కలకలం సృష్టిస్తోంది.