Advertisement

  • కర్ణాటకలో మళ్ళీ పెరుగుతున్న కరోనా... 8 వేలు దాటినా మరణాలు

కర్ణాటకలో మళ్ళీ పెరుగుతున్న కరోనా... 8 వేలు దాటినా మరణాలు

By: chandrasekar Tue, 22 Sept 2020 11:40 AM

కర్ణాటకలో  మళ్ళీ పెరుగుతున్న కరోనా... 8 వేలు దాటినా మరణాలు


కర్ణాటకలో ప్రతి రోజు ఏడు వేలకుపైగా కరోనా కేసులు, వంద వరకు మరణాలు నమోదవుతున్నాయి. అక్కడ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష వరకు ఉండగా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు, మరణాలు 8 వేలు దాటాయి.

ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 122 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,26,876కు, మరణాల సంఖ్య 8,145కు చేరింది.

గత 24 గంటల్లో 9,925 మంది కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కర్ణాటకలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,23,377కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 95,335 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

Advertisement