Advertisement

  • బిజెపి నేత జ్యోతిరాదిత్య సింథియాకు మరియు అతని తల్లి మాధవి రాజే సింధియాకు కరోనా పాజిటివ్‌

బిజెపి నేత జ్యోతిరాదిత్య సింథియాకు మరియు అతని తల్లి మాధవి రాజే సింధియాకు కరోనా పాజిటివ్‌

By: chandrasekar Tue, 09 June 2020 7:34 PM

బిజెపి నేత జ్యోతిరాదిత్య సింథియాకు మరియు అతని తల్లి మాధవి రాజే సింధియాకు కరోనా పాజిటివ్‌


బిజెపి నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా సోకింది. అస్వస్థతకు గురైన జ్యోతిరాదిత్య దక్షిణ ఢిల్లీ సాకేత్‌లోని మాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణైంది.

జ్యోతిరాదిత్య సింధియా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతుండగా, ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. కాగా, ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27 వేలు దాటింది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో ఆసుపత్రుల్లో రద్దీ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ మంగళవారం ఉదయం కరోనావైరస్ పరీక్ష చేయించుకున్నారు. అతని పరీక్ష నివేదికలు కోసం ఎదురుచూస్తున్నారు.

రెండు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు, బిజెపి జాతీయ ప్రతినిధి సంబిత్ పత్రాకు కూడా కరోనావైరస్ యొక్క లక్షణాలతో గుర్తించబడి గుర్గావ్లోని మెదంత ఆసుపత్రిలో చేరారు. సంబిత్ పత్రాను సోమవారం డిశ్చార్జ్ చేశారు.

Tags :
|

Advertisement