Advertisement

  • Breaking News: తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్...!

Breaking News: తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్...!

By: Anji Wed, 23 Dec 2020 12:42 PM

Breaking News: తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్...!

తెలంగాణలో ఇంకా కరోనా వైరస్ బారిన బడిన కేసులు నమోదు అవుతున్నాయి. ఇవాళ కూడా కేసుల సంఖ్య పెరిగింది. అయితే సామాన్యులతో పాటు... ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం వైరస్ బారిన పడుతున్నారు.

తాజాగా తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.

దీంతో వెంటనే ఎమ్మెల్యే హోం క్వారైంటైన్‌కు వెళ్లారు. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కోవిడ్‌ పరీక్ష చేయించుకోవాలన్నారు. వారంతా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

కరోనా చికిత్స చేయించుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని సూచించారు. తనను కలవటానికి కూడా ఎవరూ రావొద్దన్నారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పేర్కొన్నారు.
మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 635 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ సంఖ్య 2,82,982కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,74,833కు పెరిగాయి. కరోనాతో మరో నలుగురు మృతిచెందారు.

దీంతో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 1522కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,627 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 4,467 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

Tags :

Advertisement