Advertisement

  • Breaking News: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్...!

Breaking News: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్...!

By: Anji Tue, 03 Nov 2020 08:46 AM

Breaking News: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్...!

ఏపీలో కరోనా ఉధృతి కొంత తగ్గినప్పటికీ ఇంకా ప్రతి రోజు వేలలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ కరోనా మహమ్మారి బారిన పడి కోలుకోగా తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మాత్రం కన్ను మూసారు. తాజాగా ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

రీసెంట్ గా అయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియ చేస్తూ.. తనను కలిసిన నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం పయ్యావుల కేశవ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

Tags :

Advertisement