Advertisement

  • పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్

పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్

By: chandrasekar Sat, 04 July 2020 4:07 PM

పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యేనే ఫేస్‌బుక్ వీడియో ద్వారా ప్రకటించారు.

దీనిపై ఎమ్మెల్యే రోశయ్య మాట్లాడుతూ గురువారం నాడు కరోనా టెస్టులు చేయించుకున్నాని, కలెక్టరేట్‌లో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కి వెళ్లినప్పుడు ఈ విషయంపై తనకు సమాచారం అందిందని వెల్లడించారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యాంగానే ఉన్నానని ఎమ్మెల్యే రోశయ్య తెలిపారు. ప్రజాక్షేమం కోసం హోం క్వారంటైన్‌లో ఉంటానని ఆయన తెలిపారు.

ప్రజా సమస్యలపై ఫోన్, వాట్సప్‌లో తనను సంప్రదించవచ్చునని రోశయ్య పేర్కొన్నారు. అయితే, ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా పాజిటివ్ అనే సమాచారం తెలియడంతో కలెక్టరేట్‌లో మీటింగ్‌కు వచ్చిన ఆయనను కలెక్టర్ వెనక్కి పంపించారు. ఎమ్మెల్యే కూర్చున్న చైర్‌ను బయట వేసి మీటింగ్ హాల్‌ను శానిటైజ్ చేయించారు. ఎమ్మెల్యేకు పాజిటివ్ అని తేలడంతో మీటింగ్‌కు వచ్చిన హోం మంత్రితో పాటు ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే అందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

రోశయ్యతో కలిసి ఏపీలో కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరుకుంది. తొలుత విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు, కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Tags :
|
|
|

Advertisement