నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్
By: chandrasekar Fri, 07 Aug 2020 11:27 AM
సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు
చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలామంది లోక్ సభ
సభ్యులు, మంత్రులు, సినీ
ప్రముఖులు ఎందరో కరోనా బారిన పడ్డారు. తాజాగా సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్ అని
నిర్ధారణ అయింది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మరో 11 మంది కరోనా బారిన పడ్డారు. మొదట ఆమె మామ గంగాధర్ రానాకు
కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
దీంతో ఆమె కుటుంబం మొత్తం
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 60 మంది సభ్యులు, కార్యకర్తలకు
కరోనా పరీక్షలు చేశారు. నవనీత్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం
వహిస్తున్నారు. నటిగా ఎన్నో సినిమాల్లో నటించిన నవనీత్ గత సార్వత్రిక ఎన్నికల్లో
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 36 వేల
ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.