Advertisement

Breaking News: కరోనా విలయం..ముఖ్యమంత్రికి పాజిటివ్‌...!

By: Anji Sun, 15 Nov 2020 5:14 PM

Breaking News: కరోనా విలయం..ముఖ్యమంత్రికి పాజిటివ్‌...!

మణిపుర్​ సీఎం ఎన్​. బీరెన్​సింగ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు.

కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారంతా వెంటనే కొవిడ్​ టెస్టు చేయించుకోవాలి’ అని ట్వీట్​ చేశారు బీరెన్ సింగ్. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని పేర్కొన్నారు.

దేశంలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. కొత్తగా 41,100 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 447 మంది ప్రాణాలు కోల్పోయారు.దేశంలో తాజాగా 42,156 మంది వైరస్​ను​ జయించారు.

కేసుల సంఖ్య 5 లక్షల దిగువనే కొనసాగుతోంది.నవంబరు 14 వరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల 48 లక్షల 36 వేలకుపైగా కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

Tags :

Advertisement