Breaking News: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్...!
By: Anji Thu, 05 Nov 2020 08:25 AM
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. పెద్దపల్లి జిల్లా మంథిని నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేశారు. తనతోపాటు తన సెక్యూరిటీ సిబ్బంది శ్రీనివాస్కు కూడా వైరస్ సోకినట్టు శ్రీధర్ బాబు చెప్పారు. ప్రస్తుతం తామిద్దం హోం క్వారంటైన్లో ఉన్నామని.. తన ఆరోగ్యం నిలకడగా ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఇటీవల తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. ఆరోగ్యశాఖ నిర్దేశించిన ప్రోటోకాల్లను అనుసరించమని అభ్యర్థిస్తున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరారు.
Tags :
corona |