కొంప ముంచిన ట్యూషన్.. 39 మందికి కరోనా పాజిటివ్..!
By: Anji Fri, 02 Oct 2020 10:37 AM
ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గాయి.. రికవరీ రేటు పెరిగింది అనుకునే టైములో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా రాష్ట్రంలో ని గ్రామాల్లో మాత్రం వైరస్ పంజా విసురుతోంది.
తాజాగా గుంటూరు జిల్లాలోనూ అదే జరిగింది.. ట్యూషన్ కొంప ముంచింది. ఒకరితో మొదలై 30మందికిపైగా కరోనాబారిన పడ్డారు. ఆ గ్రామంలో ఒకే రోజు ఏకంగా 39 కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లి మండలం భట్లూరులో కరోనా కలకలం రేగింది. గ్రామంలో ఓ టీచర్ స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు.. మొదట ఆ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ తేలింది.
ఆ తర్వాత టీచర్తో పాటూ 14మంది విద్యార్థులకు కరోనా నిర్థారణకాగా.. విద్యార్థులతో పాటూ పలువురు తల్లిదండ్రులకు వైరస్ సోకింది. ఆ ట్యూషన్ సెంటర్లో మొత్తం 50మందికి స్టడీ అవర్కు వెళుతున్నారు. కరోనా బారినపడిన విద్యార్థులంతా ఏడేళ్లలోపు వారే కాగా.. వారందర్ని గుంటూరు క్వారంటైన్కు తరలించారు.
తల్లిదండ్రుల్ని మాత్రం హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇక గ్రామంలో ఒకే రోజు భట్లూరులో 39 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రామాల్లో ఎవరైనా ట్యూషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.