Advertisement

  • Breaking: తాజాగా మరో ముగ్గురు క్రికెట్ ఆటగాళ్లకు కరోనా...!

Breaking: తాజాగా మరో ముగ్గురు క్రికెట్ ఆటగాళ్లకు కరోనా...!

By: Anji Tue, 01 Dec 2020 9:30 PM

Breaking: తాజాగా మరో ముగ్గురు క్రికెట్ ఆటగాళ్లకు కరోనా...!

పాకిస్థాన్ క్రికెట్ జట్టు లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో జట్టులో కరోనా కేసుల సంఖ్య 10 కి చేరింది.

తాజాగా పాకిస్థాన్ యూనిట్‌లోని మొత్తం 46 మంది సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. న్యూజిలాండ్‌లో డిసెంబర్ 18 నుండి 3 మ్యాచ్‌ల టీ20 ఐ సిరీస్ మరియు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది.

ఈ పర్యటన జనవరి 7 తో ముగుస్తుంది. అయితే ఇందుకోసం మొత్తం 54 మంది ఆటగాళ్లు కివీస్ కు వెళ్లారు. అయితే అక్కడ వారు కరోనా నియమాలను పాటించకపోవడం తో మొదట ఆరుగురు, తర్వాత ఒక్కరు ఇప్పుడు ముగ్గురు ఆటగాళ్లు ఈ విటర్ బారిన పడ్డారు.

అయితే ఇంతకముందే మొత్తం జట్టుకు తుది హెచ్చరిక జారీ చేయబడింది. కరోనా కట్టడికోసం రూపొందించబడిన నిబంధనలకు కట్టుబడి ఉండాలి మరియు మా సిబ్బందిని సురక్షితంగా ఉంచండి “అని కివీస్ ఉన్నత ఆరోగ్య అధికారి ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ అన్నారు. అయితే గతంలో కూడా పాక్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే సమయంలో ఇలానే జరిగింది.

Tags :

Advertisement