బోల్సొనారోకి మూడో టెస్ట్ లోను కరోనా పాజిటివ్
By: chandrasekar Thu, 23 July 2020 11:11 AM
కరోనా పరీక్షల్లో
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు మూడు సార్లు పాజిటివ్గా తేలింది.
మంగళవారం నమూనాలు సేకరించగా, బుధవారం వెలువడిన ఫలితాల్లో లక్షణాలు ఉన్నట్లు
గుర్తించారు.
కరోనా లక్షణాలతో
బాధపడుతున్న ఆయన ఈ నెల 7న పరీక్షలు చేయగా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో
అధ్యక్ష భవనంలోనే స్వీయ నిర్భంధంలో ఉన్నారు. బోల్సొనారో ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యులు
పరిశీలిస్తున్నారని అధ్యక్ష పరిపాలన భవనం ఒక ప్రకటనలో పేర్కొంది.
గత వారం నిర్వహించిన
పరీక్షల్లోనూ పాజిటివ్గా వచ్చింది. స్వీయ నిర్బంధంలో ఉన్న సమయంలో బోల్సొనారో
అల్పహారం, కాఫీ
తీసుకుంటున్న చిత్రాలను ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అమెరికా తర్వాత
కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండో బాధిత దేశంగా ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా
నివేదిక ప్రకారం ఇప్పటి వరకు బ్రెజిల్లో 21,67,988 కేసులు నమోదవగా,
14,65,970 మంది కోలుకున్నారు. 6,20,390 మంది చికిత్స పొందుతుండగా, వైరస్ ప్రభావంతో 80వేలకుపైగా మృతి చెందారు.