కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషికి కరోనా పాజిటివ్
By: chandrasekar Thu, 08 Oct 2020 09:37 AM
దేశంలో కరోనా వైరస్
ప్రభావం ఏమాత్రం తగ్గకుండా పెరుగుతూనే వుంది. ప్రస్తుతం కేంద్ర పార్లమెంటరీ
వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషికి కరోనా సోకింది. కరోనా పరీక్షలో పాజిటివ్గా
నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, హోమ్
క్వారంటైన్లో ఉంటున్నట్లు చెప్పారు.
తనకు కరోనా
సోకినట్లు బుధవారం ఆయన ట్వీట్ చేశారు.
కర్ణాటకకు చెందిన ప్రల్హాద్ జోషి, కరోనా నేపథ్యంలో గత నెలలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల కాలంలో
పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకింది.
వైరస్ బారిన పడిన వారిలో
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర
ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కైలాష్
చౌదరి సహా పలువురు కేంద్ర మంత్రులు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు.