Advertisement

  • తిరుమల లో ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా పాజిటివ్

తిరుమల లో ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా పాజిటివ్

By: chandrasekar Sat, 18 July 2020 8:36 PM

తిరుమల లో ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా పాజిటివ్


తిరుమలలో ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మద్య కాలంలో అర్చకులలో చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసినదే. దీనితో టీటీడీ అర్చకులలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే 18మంది అర్చకులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలుస్తుంది . వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారము . మెరుగైన వైద్య చికిత్స కోసం అర్ధరాత్రి చెన్నై అపోలోకు తరలించారు.

పెద్ద జీయ్యంగార్‌‌ను కూడా చెన్నై అపోలోకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తరలిస్తున్నారు. చిన్ని జీయర్‌తో పాటు మరికొంత మంది అర్చకులకు అస్వస్థతగా ఉండటంతో... మిగిలిన అర్చకులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. దర్శనాలు ప్రారంభించినప్పటి నుంచి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని తిరుపతికి చెందిన స్థానికులు, టీటీడీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి.. ఏకాంతంగా స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. శ్రీవారి ఆలయంలో తాత్కలికంగా దర్శనాలను నిలిపివేసి... ఏకాంతంగా స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించే యోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నట్టు తెలుస్తున్నది.

Tags :
|

Advertisement