తెలంగాణ సీనియర్ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్
By: chandrasekar Sat, 08 Aug 2020 5:26 PM
తెలంగాణలో కరోనా వైరస్
తీవ్ర రూపం దాల్చి అందరిని భయపెడుతుంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు
అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ మంత్రి మల్లారెడ్డి కోవిడ్ బారిన
పడ్డారు. ఇటీవల మంత్రికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో హోం ఐసోలేషన్లో
ఉండి చికిత్స పొందుతున్నారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో
వైద్యాధికారులు నిమగ్నమయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో MLA
లతో బాటు మంత్రులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
వీరిలో రెండో వ్యక్తిగా మంత్రి మల్లారెడ్డి కరోనా బారిన పాడడం గమనార్హం. గతంలో హోం
మంత్రి మహమూద్ అలీ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు
రామ్మోహన్ కూడా కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ప్రజాసేవలో పాల్గొనే రాజకీయ
నాయకులు తరచు కరోనా బారిలో పడుతున్నారు.
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే
సుధీర్ రెడ్డి, ఆయన
కుటుంబీకులకు కూడా కరోనా సోకింది. తెలంగాణలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. కాంగ్రెస్ నేత
వీహెచ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా
కరోనాను జయించారు. ప్రజలంతా బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు
తీసికోవాలని అధికారులు తెలిపారు.