Advertisement

నాకు కరోనా పాజిటివ్: కేంద్ర మంత్రి

By: chandrasekar Wed, 28 Oct 2020 9:57 PM

నాకు కరోనా పాజిటివ్: కేంద్ర మంత్రి


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం సాయంత్రం తన ట్విటర్ లో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే స్మృతి ఇరానీ తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని కూడా కాస్త వినూత్నంగా తెలిపారు.

ఇటీవల తనను కలిసిన వారందరూ త్వరగా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.

‘ఏదైనా ప్రకటన చేయాల్సి వచ్చినప్పుడు నేను చాలా అరుదుగా పదాల కోసం వెదుకుతాను. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని చాలా సింపుల్‌గా చెప్తున్నాను. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల నన్ను కలిసిన వారు సాధ్యమైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను’ అని స్మృతి ఇరానీ ట్వీట్ లో తెలిపారు.

Tags :
|
|

Advertisement