ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్
By: chandrasekar Sat, 08 Aug 2020 5:21 PM
రోజు రోజుకి
వ్యాపిస్తున్న కరోనా ఇప్పుడు రాజకీయ నాయకులపై ప్రభావం అధికమయింది. తెలంగాణలో టీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే
కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా
వైరస్ పాజిటివ్ గుర్తించబడింది. ఆయనతో బాటు ఆయన భార్య పిల్లలకు కూడా కరోనా
పాజిటివ్ గా నిర్ధారణ చేయబడింది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు
ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి
రెడ్డి, గొంగిడి సునీత, బాజిరెడ్డి
గోవర్ధన్ తదితరులు కరోనా సంక్రమించిన వారి జాబితాలో ఉన్నారు. ప్రబలుతున్న కరోనా
నుండి తగు జాగ్రత్తలు తీసికొని వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలని జగన్ ప్రభుత్వం
అనేక సూచనలు చేస్తూవుంది.
అనతి కాలంలో కరోనా
మహమ్మారి ప్రభావంతో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ
మంత్రులు, ఎంపీలు కూడా ప్రభావితం అవుతున్నారు. ఇటీవలే భద్రాచలం
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా వల్ల చనిపోయారు. శనివారం కాంగ్రెస్ మాజీ ఎంపీ
నంది ఎల్లయ్య కూడా కరోనా కాటుకు చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న
ఆయన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
ఆయనకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు నిమ్స్కు తీసుకెళ్లి చికిత్స చేసారు.
రాష్ట్రంలో
విజృంభిస్తున్న కరోనా శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 2,256 కొత్త కేసులను గుర్తించారు. ఈ వారం ఆరంభంలో కరోనా
కేసుల సంఖ్య తగ్గగా నాలుగు రోజుల నుంచి రోజుకు 2 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కోవిడ్
బారిన పడి 14 మంది
ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 615కు చేరింది. 24
గంటల్లో 1091 మంది కరోనా నుంచి కోలుకోగా బాధితుల మొత్తం సంఖ్య 54,330కి చేరింది. కరోనా టెస్టులు అధికంగా చేయడంవల్ల
ఎక్కువగా బాధితుల వివరాలు తెలియవస్తున్నాయి అని అధికారులు తెలిపారు.