'కెవ్వుకేక' సినిమా హీరోయిన్ కు మరియు వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్
By: chandrasekar Fri, 04 Sept 2020 8:06 PM
అటు సినిమా నటులను వదలని కరోనా ఇప్పుడు ఒక హీరోయిన్ కు మరియు వారి కుటుంబ సభ్యులకు వ్యాపించింది. కన్నడ హీరోయిన్ శర్మిలామండ్రే కరోనా బారిన పడ్డారు. తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని శర్మిలా నిర్ధారించారు. తనతో పాటు కుటుంబ సభ్యులలో కొందరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని పేర్కొంది.
ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సలహాలతో చికిత్స పొందుతున్నాము అని పేర్కొంది. శర్మిలా తెలుగులో అల్లరి నరేష్ సరసన హీరోయిన్గా ‘కెవ్వుకేక’ చిత్రంలో నటించింది. లాక్డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి స్నేహితులతో బయట తిరుగుతూ నానా రచ్చ చేసిన శర్మిలా మండ్రే కొద్ది రోజుల పాటు వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈమె పేరు డ్రగ్స్ వ్యవహారంలోను వినిపిస్తుంది. అయితే దీనిపై స్పందించిన శర్మిలా కొన్ని న్యూస్ ఛానెల్స్ టీఆర్పీల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తుందని పేర్కొంది. నేను చాలా సంవత్సరాల కృషితో ఈ స్థాయికి వచ్చాను. దయచేసి అర్ధం చేసుకోండని ట్వీట్లో తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈమెకు కరోనా వచ్చి ఉంటుందని చెపుతున్నారు.