భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్ కు కరోనా పాజిటివ్
By: chandrasekar Sat, 29 Aug 2020 09:51 AM
దేశంలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో క్రీడాకారులను కూడా వాడాలి పెట్టలేదు. భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని వినేశ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా శుక్రవారం తెలియజేశారు. ఈ సంవత్సరం ఖేల్ రత్నా అవార్డుకు ఎంపికైన వారిలో వినేశ్ ఫోగట్ కూడా ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన ఫోగట్ ప్రస్తుతం కోచ్ ఓం ప్రకాశ్తో కలిసి తన గ్రామం సోనెపట్లో శిక్షణ పొందుతున్నారు.
జాగ్రత్త చర్యలో భాగంగా నిన్న చేయించుకున్న కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలో (క్వారంటైన్ లో) ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా నా నుండి వేరుగా ఉన్నారు. ఇటీవల నాతో ప్రాథమిక కాంటాక్టులో ఉన్నవారందరు కూడా పరీక్షలు చేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నా అని తెలిపారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి! ధన్యవాదాలు అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. ఆమె తన స్వగ్రామంలోనే క్వారంటైన్ లో వున్నారు.