ఇండియా హాకీ కెప్టెన్ తో పాటు నలుగురు హాకీ ప్లేయర్స్ కి కరోనా పాజిటివ్
By: chandrasekar Sat, 08 Aug 2020 11:26 AM
భారత హాకీ జట్టు కెప్టెన్
మన్ప్రీత్ సింగ్కి కరోనా పాజిటివ్గా అని తేలింది. టోక్యో ఒలింపిక్స్ సన్నద్ధత
కోసం బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇటీవల మన్ప్రీత్ సింగ్
వచ్చాడు. తాజాగా సాయ్లో నిర్వహించిన పరీక్షల్లో మన్ప్రీత్ సింగ్తో పాటు మరో
నలుగురు హాకీ ఆటగాళ్లకి కూడా కరోనా సోకినట్లు తేలింది.
ఈ ఐదుగురు జట్టుతో కలిసి
ఉండటంతో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి సాయ్లో హాకీ క్యాంప్ కి ముందు
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆటగాళ్లకి ర్యాపిడ్ టెస్టు చేశారు. కానీ ఇందులో ఏ
ఒక్కరికీ పాజిటివ్ రాలేదు. అయితే గురువారం మన్ప్రీత్ సింగ్తో పాటు సురేందర్లో
కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా
తేలింది.
టీమ్ మొత్తానికీ పరీక్షలు
చేయగా జస్ర్కన్ సింగ్, వరుణ్
కుమార్, గోల్కీపర్ క్రిష్ణన్ బి పథక్కి కూడా కరోనా
పాజిటివ్గా వచ్చింది. దాంతో వారిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కరోనా పాజిటివ్ రావడంతపై మన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘‘సాయ్ క్యాంపస్లోనే
ప్రస్తుతం నేను సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాను. సాయ్లో అథ్లెట్స్కి కరోనా వైరస్
పరీక్షలు తప్పనిసరి చేయడం మంచి పని. ఆ నిబంధన కారణంగానే సమస్యని ఆరంభంలోనే
గుర్తించగలిగాం. త్వరలోనే పూర్తిగా కోలుకుని మీ ముందుకు వస్తా’’ అని ధీమా వ్యక్తం
చేశాడు.