బార్సిలోనా జూలో సింహాలకు కరోనా పాజిటివ్
By: Sankar Thu, 10 Dec 2020 8:22 PM
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే ...ముఖ్యంగా ఇండియా , అమెరికా తో పాటు యూరోప్ దేశాలు ఎక్కువగా ఈ మహమ్మారికి బలి అయ్యాయి...
తాజాగా స్పెయిన్లోని బార్సిలోనా జంతు ప్రదర్శనశాలలో నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు జూ అధికారులు తెలిపారు. జూపార్క్లోకి నిత్యం సందర్శకులు వస్తుండడంతో అందులోని నాలుగు సింహాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటికి కొవిడ్-19 పాజిటివ్గా తేలిందని పశు వైద్యాధికారులు తెలిపారు.
జాలా, నిమా, రన్ రన్, కింబే అనే సింహాల్లో స్వల్ప లక్షణాలున్నట్లు కీపర్లు గుర్తించారు. జూపార్క్లోని ఇద్దరు సిబ్బంది సైతం వైరస్ పాజిటివ్గా పరీక్షించారు. అయితే సింహాలకు వైరస్ ఎలా సోకి ఉంటుందని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సింహాలకు సైతం మనుషులకు చేసినట్లు పీసీఆర్ పరీక్షలు చేశారు...