కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు కరోనా పాజిటివ్
By: chandrasekar Sat, 17 Oct 2020 10:14 AM
కరోనా ఉధృతి ఏమాత్రం
తగ్గకుండా విజృభిస్తూనే వుంది. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత దీని బారిన
పడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ కరోనా
బారినపడ్డారు. శుక్రవారం కొవిడ్-19 పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ వచ్చింది. నాకు
కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్లో ఉంటున్నట్లు తెలిపారు.
ఆయనకు కరోనా పాజిటివ్ గా
గుర్తించడంతో గత కొన్నిరోజులుగా నన్ను కలిసేందుకు వచ్చిన వారు కరోనా పరీక్ష
చేయించుకొని క్వారంటైన్లో ఉండాలని అని ట్విట్టర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉండగా కొద్దిరోజుల కిత్రమే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మాద్ పటేల్తోపాటు
మోతీలాల్ వోరా, అభిషేక్ సంఘ్వీ కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
కరోనా బారిన పడ్డ వీరిలో
సంఘ్వీ ఇప్పటికే కోలుకోగా మిగిలిన వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వరుసగా
కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరోనా బారినపడుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన
వ్యక్తమవుతోంది. అయన త్వరగా కోలుకుని బయటకు రావాలని పార్టీ వర్గాలు
కోరుకుంటున్నాయి.