Advertisement

చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కరోనా పాజిటివ్!

By: Anji Mon, 14 Sept 2020 4:50 PM

చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కరోనా పాజిటివ్!

వైసీపీ పార్టీ ఎంపీలు వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో భాగంగా పార్లమెంటు సిబ్బంది చేసిన కరోనా పరీక్షల్లో వైసీపీ పార్టీ కి చెందిన ఇద్దరు ఎంపీలు కరోనా బారినపడ్డారు. ఇప్పటికే అరకు కొత్త ఎంపీ గొడ్డేటి మాధవి కరోనా పాజిటివ్ రాగా..తాజాగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు (సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. 18 రోజులపాటు సాగే ఈ సభాకార్యకలాపాలు పాలీ కార్బన్ షీట్లతో ఎంపీల మధ్య (భౌతిక) దూరం పెంచాయి. జీరో అవర్ ను కుదించడం, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం ఈ సెషన్ లో ముఖ్య విశేషం.

Tags :

Advertisement